Andhra Pradesh Mahesh Co-operative Urban Bank Ltd (ఏపీ మహేష్ బ్యాంక్) బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బ్రాంచ్ మేనేజర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ తప్పనిసరి. అదనంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, సీఏ, సీఎఫ్ఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ఏ, సీఏఐఐబీ వంటి ప్రొఫెషనల్ అర్హతలు కలిగి ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం అవసరం. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 20లోపు అప్లై చేయాలి. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించడం మంచిది.
