Reading Time: < 1 minute

భారతదేశంలో తమిళనాడును “టెంపుల్ స్టేట్”గా పిలుస్తారు. కారణం అక్కడి ఆలయాల ప్రత్యేకతలు, వాటి వెనుక ఉన్న గొప్ప చరిత్రే. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి . ఇది లోని నల్లూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో పూజించే శివలింగం రోజుకు ఐదు సార్లు రంగు మారుతుందని భక్తుల విశ్వాసం. కాలక్రమేణా ఈ విశేషమే ఆలయానికి ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ అద్భుతాన్ని చూడటానికి తమిళనాడు నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైందని, చోళుల కాలంలో, ముఖ్యంగా పాలనలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. అనేకసార్లు పునర్నిర్మాణాలు జరిగినప్పటికీ ఆలయ సంప్రదాయాలు, ఆచారాలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఇక్కడ శివుడిని కల్యాణ సుందరేశ్వరుడిగా పూజిస్తారు. మురుగన్‌కు కూడా ఈ ఆలయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉండటంతో శివుడు, కార్తీకేయ భక్తులు ఇక్కడకు తరచూ వస్తుంటారు.

ఆలయంలో రెండు నల్ల రాతి శివలింగాలు ఉన్నాయి. ఒకటి గర్భగుడిలో ఉండి బంగారంతో అలంకరించబడుతుంది. మరొకటి ప్రవేశ ద్వారం వద్ద ఉంటుంది. ఈ శివలింగానికి ప్రతిరోజూ గంధపు చెక్కతో అభిషేకం చేయడంతో మధ్యాహ్నం ఆలయమంతా సువాసన పరిమళిస్తుంది. రోజుకు ఐదు పూజలు నిర్వహించే ఈ ఆలయంలో శివలింగం ఉదయం నలుపు, మధ్యాహ్నం తెలుపు, సాయంత్రం ఎరుపు, రాత్రి లేత నీలం, అర్ధరాత్రి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ రంగుల మార్పుకు ఇప్పటివరకు శాస్త్రీయ వివరణ లేకపోయినా, సహజంగానే జరుగుతుందని విశ్వసిస్తున్నారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది.
(Disclaimer: ఈ కథనం మతపరమైన విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది.)