Reading Time: < 1 minute

రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వైన్ షాపులు, బార్లను 3 రోజుల పాటు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే ఫిబ్రవరి 13వ తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే సంబంధిత లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ శాఖ హెచ్చరించింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.