తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ దళిత యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక అవకాశం అందించింది. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్సీ యువత కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ ఇవ్వబోతున్నారు. ‘టర్న్ డ్రీమ్స్ ఇన్ టు డ్రైవ్’ పేరుతో ఈ పథకం అమలులో ఉంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు యువతకు స్వయం ఉపాధి కల్పించడం ఈ పథక లక్ష్యం. దీని కింద రెండు రకాల వాహనాలను అందిస్తున్నారు: ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మరియు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు. వీటికి 90 శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల, ఎంపికైన లబ్ధిదారులు వాహనం ధరలో కేవలం అతి తక్కువ మొత్తాన్ని చెల్లించి వాహనం సొంతం చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయాలనేవారు తప్పనిసరిగా హైదరాబాద్ జిల్లా నివాసితులే కావాలి. పథకానికి అర్హులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత మాత్రమే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ https://tgobmms.cgg.gov.in ను సందర్శించవచ్చు. ఈ అవకాశం మార్చి 24, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అర్హులైన యువత త్వరగా స్పందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Disclaimer : ఈ వార్తలో చెప్పిన పథకం వివరాలు అధికారిక వెబ్సైట్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. దరఖాస్తు చేసే ముందు అన్ని అర్హతలు, షరతులు, సమయములపై అధికారిక సమాచారాన్ని ధృవీకరించడం అవసరం. పథకంలో ఎలాంటి మార్పులు, సబ్సిడీ పరిమితులు, గడువు తేదీలు అధికారిక ప్రకటనల ఆధారంగా మాత్రమే తేలుతుంది.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









