కుటుంబంలో జరిగిన చిన్న గొడవ విషాదాంతానికి దారి తీసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. సాంబార్ వంటకం విషయంలో భర్తతో జరిగిన వాగ్వాదం తర్వాత భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, బెంగళూరు శివారులో నివసిస్తున్న కావ్య (27), రంగస్వామి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో భోజనం కోసం కావ్య సాంబార్ వండింది. అయితే అదే సాంబార్ను ఫ్రిజ్లో ఉంచి మూడు రోజులుగా భర్తకు వడ్డిస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య బాత్రూమ్లోకి వెళ్లింది. అక్కడ పొలాల కోసం ఇంట్లో ఉంచిన పురుగుల మందు తాగినట్లు సమాచారం.
బాత్రూమ్ నుంచి భార్య బయటకు రాకపోవడంతో రంగస్వామి పలుమార్లు పిలిచాడు. స్పందన లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది.
ఈ ఘటనపై కావ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబంలో జరిగిన చిన్న గొడవ ఇలాంటి విషాదానికి దారి తీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Disclaimer : ఈ కథనం పోలీసుల ప్రాథమిక సమాచారం ఆధారంగా రూపొందించబడింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









