బెంగళూరు లో సంచలనానికి గురిచేసే దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. తాళాలు అలాగే ఉండగా గదిలోని విలువైన బంగారు ఆభరణాలు మాయమవడం మిస్టరీగా మారింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో కోటి రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లడం ఈ ఘటనను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ సంఘటన అవలహళ్లి ప్రాంతంలోని ఎస్డీపీ ప్యాలెస్లో జరిగిన పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సిరువెల్ల శ్రీదేవి తన కుటుంబ సభ్యుల పెళ్లికి హాజరయ్యేందుకు భారత్కు వచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొన్న ఆమె, తనతో తెచ్చుకున్న సుమారు 725 గ్రాముల బంగారు ఆభరణాలను ఫంక్షన్ హాల్లోని గదిలో భద్రపరిచారు.
పెళ్లి విందుకు వెళ్లే సమయంలో కొన్ని ఆభరణాలు ధరించి, మిగిలిన వాటిని గదిలో పెట్టి తాళం వేసి వెళ్లినట్లు ఆమె తెలిపింది. అయితే రాత్రి తిరిగి గదికి వచ్చినప్పుడు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. గదికి వేసిన తాళం మాత్రం అలాగే ఉండటం ఈ కేసును మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది.
బాధితురాలు అవలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గదిలో ఉంచిన ఝుమ్కాలు, వడ్డాణం సహా విలువైన నగలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోపలి వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గది తాళం చెవి బాధితురాలి వద్దే ఉండటం, అలాగే గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బందిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో పెళ్లి వేడుకల్లో భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మిస్టరీ కేసును త్వరలోనే ఛేదిస్తామని అధికారులు తెలిపారు.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









