Reading Time: < 1 minute

భక్తుల పాలిట కొంగుబంగారంగా భావించే వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో, ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

ములుగు జిల్లా మేడారంలో సౌకర్యాల మెరుగుదల కోసం యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

ఈ పనుల నేపథ్యంలో నేడు ఒక్కరోజు మేడారంలో సమ్మక్క-సారలమ్మల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ పూజారులు ప్రకటించారు. గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు, అలాగే గద్దెల విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆదివాసీ సంప్రదాయ పూజా విధానాల ప్రకారం పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠ పూజలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, నేటి దర్శన బంద్‌కు సహకరించాలని పూజారులు కోరారు.