Reading Time: < 1 minute

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోవాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే ప్రయత్నిస్తుండగా, అధికార డీఎంకే వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది.

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని ప్రారంభించడంతో ఇది ఎన్నికల తాయిలాలంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. అయితే ఈ పథకం కొత్తది కాదని, 2011లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారని డీఎంకే గుర్తుచేసింది.

2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి పంపిణీ ప్రారంభమైంది.

ఎన్నికల ముందు ఈ అంశం చుట్టూ రాజకీయ రచ్చ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.