Reading Time: < 1 minute

సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన కన్నడ నటుడు ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భార్య తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నదని, ప్రాణహానీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గిరినగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరులో కేసు నమోదుైంది. ఫిర్యాదులో, సరైన సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిన విషయంపై ప్రశ్నించగా అర్షిత దాడి చేసిందని పేర్కొన్నారు. గూండాలతో బెదిరింపులు చేయడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.

బాత్రూమ్‌లో గాజు పలకకు తానే గాయపడి, తనపై తప్పుడు ఆరోపణలు చేయాలని బెదిరించిందని ధనుష్ రాజ్ పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.