Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ:
TGGENCOకు చెందిన KTPS కాంప్లెక్స్‌లో సోమవారం (26-01-2026) 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు స్థానిక H-82 యూనియన్ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు, రీజియన్ కార్యవర్గ సభ్యులు, ఆర్టిసన్ కార్మిక సోదర–సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం H-82 TGGENCO రాష్ట్ర అధ్యక్షులు ఆవుల కృష్ణా రెడ్డి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ సాధన, ఆర్టిసన్ నుంచి O&M ఉద్యోగులుగా కన్వర్షన్ సమస్యలు, అలాగే సమాన పనికి సమాన వేతనం వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అందరూ సమిష్టిగా ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం H-82 జెన్‌కో రాష్ట్ర కార్యదర్శి వెంపటి అనిల్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మసూద్, జాయింట్ సెక్రటరీ కేసరి రవీందర్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో అయినా అందరం కలిసి సమిష్టి నిర్ణయాలతో ఉద్యమిస్తూ సమస్యలను సాధించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో అడుసుమిల్లి హనుమంతరావు, మహేశ్వరం శ్రీనివాస్, సాంబ, శివ, రాంబాయి, చెరుకు శ్రీను, శోభ, జామ్లా, సమీర్, రమణ, నరేష్, రవీందర్, శ్రీశైలం, మొయిన్, నవీన్ తదితర కార్మికులు పాల్గొన్నారు.