class="wp-singular post-template-default single single-post postid-715 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో Jana Sena Party ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మొత్తం 15 వార్డుల్లో 9 స్థానాలు కాంగ్రెస్‌, 5 స్థానాలు బీఆర్‌ఎస్‌ దక్కించుకోగా, ఒక వార్డును జనసేన సాధించింది. ఈ విజయంపై పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్పందిస్తూ అభినందనలు తెలిపారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు ఇది ప్రోత్సాహం ఇస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.