హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమధుర అపార్ట్మెంట్లో నివసిస్తున్న మనుశ్రీ (32) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆమె నగరంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తూ కొండాపూర్లో నివాసం ఉంటోంది.
ఆదివారం రాత్రి నుంచి మనుశ్రీ ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆమె పక్క గదిలో నివసిస్తున్న స్నేహితురాలికి సమాచారం ఇచ్చి పరిస్థితి తెలుసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం ఆమె స్నేహితురాలు గదికి వెళ్లి చూడగా తలుపులు లోపల నుంచి మూసి ఉన్నట్లు గుర్తించింది.
సందేహం కలగడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా మనుశ్రీ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పని ఒత్తిడి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Disclaimer : ఈ వార్త అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు వివరాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…
- Heat Alert: ఎండలో నుండి వచ్చాక వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు…
- Ganga Expressway Launch: ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన ప్రధాని
- Instagram – Crime: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా యువకుడి హత్య
- Crime Shock: హృదయ విదారక ఘటన… 18 నెలల చిన్నారిని కాలువలో పడేసిన తల్లి…









