ఇండియాలో AI న్యూస్ యాంకర్స్ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. తాజాగా అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఓ న్యూస్ వీడియో షేర్ చేశారు.
అందులో అంకిత అనే AI యాంకర్ అస్సాం కేబినెట్ నిర్ణయాలను రిపోర్ట్ చేసింది. ‘డిబ్రుఘర్ విమానాశ్రయం పేరును భూపెన్ హజారికగా మార్చడం నుంచి టీ గార్డెన్ వర్కర్స్కు వన్ టైమ్ గ్రాంట్ వరకు ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నాం’ అంటూ సీఎం హిమంత పోస్ట్ చేశారు.
